Header Banner

PMModi Visit Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ..! ఫుల్ షెడ్యూల్ ఇదే!

  Tue Jun 17, 2025 11:45        Politics

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 21న ప్రధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈమేరకు ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. మోదీ ఈ నెల 20న సాయంత్రం భువనేశ్వర్ వస్తారు.. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రాత్రికి తూర్పునౌకాదళం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. శనివారం (21న) ఉదయం 6:30 నుంచి 7:45 గంటల వరకు విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. అనంతరం ఉదయం 11:50 గంటలకు విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళతారు.
ప్రధాని మోదీ హాజరవుతుండటంతో విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షలు మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. వారందరు యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..


దీని కోసం ఆర్కే బీచ్‌లో ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి.. ఒక యోగా ట్రైనర్‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ్టి నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 'నేవల్‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు రెడ్‌ జోన్‌.. ఈ నెల 21 వరకు ఆర్కే బీచ్‌ రోడ్డును మూసివేస్తారు.. ఈ నెల 21 వరకు 5 కి.మీ పరిధిలో డ్రోన్లపై నిషేధం ఉంటుంది' అని పోలీసులు తెలిపారు. పోలీసులు విశాఖపట్నం బీచ్‌‌ రోడ్డులో పోలీసుల నిఘాను పెంచారు.. విశాఖపట్నం పోలీసులతో పాటుగా కేంద్రం నుంచి వచ్చిన సెక్యూరిటీ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి ప్రధాని మోదీ మే నెలలో అమరావతి పర్యటనకు వచ్చారు.. ఆ సమయంలోనే ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PMModiInAP #ModiVisit2025 #AndhraPradeshTour #PMModiSchedule #ModiInAmaravati #PoliticalVisit #APNews